కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు.. డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రతిపాదన
- మంగళవారం భేటీ కానున్న పార్టీ కేంద్ర ఎన్నికల సంస్థ
- ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను తెప్పించుకున్న సీఈఏ
- రాహుల్ గాంధీ మళ్లీ బాధ్యతలు చేపట్టాలని డిమాండ్
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను తెప్పించిన సీఈఏ.. డిజిటల్ ఫొటోలను పంపాలని సూచించింది. డిజిటల్ ఎన్నికలు నిర్వహించాలని కనుక నిర్ణయం తీసుకుంటే దానిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. అది గ్రీన్ సిగ్నల్ ఇస్తే డిజిటల్ పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అధ్యక్ష పదవిలోకి ఎవరైనా బరిలోకి దిగితే పోలింగ్ నిర్వహించేందుకు సీఈఏ ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు, పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ రాహులే చేపట్టాలన్న డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.