తిరుమల కొండపై హైదరాబాద్ భక్తుడి ఆత్మహత్య
- తిరుమల వచ్చిన శ్రీధర్ అనే వ్యక్తి
- వకుళమాత వసతి సముదాయంలో బస
- ఉరేసుకుని బలవన్మరణం
మరోవైపు, శ్రీధర్ గది ఖాళీ చేయాల్సిన గడువు ముగియడంతో టీటీడీ సిబ్బంది తలుపు కొట్టినా లోపలి నుంచి ఎలాంటి జవాబు రాలేదు. దాంతో బలవంతంగా తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా శ్రీధర్ ఉరేసుకున్న స్థితిలో కనిపించాడు. అప్పటికే అతడు మృతి చెందినట్టు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న తిరుమల పోలీసులు శ్రీధర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.