అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ను ఎందుకు 'భూతాల కొంప'గా పిలుస్తారో చెప్పిన పూరీ జగన్నాథ్
- మ్యూజింగ్స్ లో వైట్ హౌస్ గురించి వివరించిన పూరీ
- వైట్ హౌస్ లో పది మంది చనిపోయారని వెల్లడి
- లింకన్ ఆత్మ గురించి ప్రస్తావన
ఓసారి ఓ అధ్యక్షుడు స్నానం చేసి వస్తుంటే "గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్" అని వినిపిస్తే ఆయన హడలిపోయారని, అది అబ్రహాం లింకన్ ఆత్మ అని అప్పట్లో ప్రచారం జరిగిందని పూరీ వివరించారు. లింకన్ 11 ఏళ్ల కొడుకు వైట్ హౌస్ లో చనిపోవడం వల్ల ఆ చిన్నారి ఆత్మను పలకరించేందుకే లింకన్ ఆత్మ వైట్ హౌస్ కు వస్తుంటుందని చెప్పుకుంటారని వివరించారు. "పైగా, రాత్రివేళల్లో అక్కడ ఏవో శబ్దాలు వినిపిస్తాయట. వయొలిన్ వాయించినట్టు, గట్టిగా అరుస్తున్నట్టు ధ్వనులు వస్తుంటాయట" అని వివరించారు.