నేను బీజేపీలో చేరడం లేదు: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
- విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం
- బీజేపీ నేత భూపేందర్ యాదవ్ను కలిసినట్టు వార్తలు
- పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదన్న విశ్వేశ్వర్రెడ్డి
ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ను కలిసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై విశ్వేశ్వర్రెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, పూర్తిగా అవాస్తవమని కొట్టిపడేశారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని చెప్పుకొచ్చారు.