సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ పై ఎస్ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు
- సీఎం గురించి వెకిలిగా, చిల్లరగా మాట్లాడారు
- మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
- సంజయ్ ను అరెస్ట్ చేసి ప్రచారంలో పాల్గొనకుండా చేయాలి
ఈ సందర్భంగా మీడియాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గురించి వెకిలిగా, చిల్లరగా మాట్లాడటం బండి సంజయ్ కే చెల్లిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలని కోరారు.