అతి చిన్న గ్రామంలో ఒక్కడికి తప్ప అందరికీ కరోనా పాజిటివ్
- హిమాచల్ ప్రదేశ్ లోని తొరాంగ్ గ్రామ జనాభా 42 మంది
- 41 మందికి కరోనా పాజిటివ్
- ఇటీవల ఓ మత కార్యక్రమం కోసం గుమికూడిన గ్రామస్తులు
తొరాంగ్ గ్రామ జనాభా 42 మంది కాగా, 52 ఏళ్ల భూషణ్ ఠాకూర్ అనే వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వచ్చింది. మిగతా అందరూ కరోనా బారినపడ్డారు. ఈ గ్రామం మనాలి-లేహ్ రహదారిపై ఉంది. గ్రామంలో కరోనా ప్రబలడంతో టూరిస్టులకు ఈ ప్రాంతంలో ప్రవేశాలు నిలిపివేశారు. ఇక, నెగెటివ్ వచ్చిన భూషణ్ ఠాకూర్ కుటుంబంలోని ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. కొన్నిరోజుల కిందట జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఒక్కచోట గుమికూడడంతో కరోనా వ్యాప్తి చెందినట్టు అధికారులు భావిస్తున్నారు.