భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపన కూడా జరగకముందే లేఖలు రాయడం విడ్డూరంగా ఉంది: గోరంట్ల
- భోగాపురం ఎయిర్ పోర్టు అంశంలో గోరంట్ల స్పందన
- కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి విజయసాయి లేఖ
- ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉందని గోరంట్ల విమర్శలు
బహుశా భోగాపురంలో రియల్ ఎస్టేట్ పెరగాలన్న ఆశతోనే లేఖ రాసి ఉండొచ్చని గోరంట్ల పేర్కొన్నారు. అంతేకాదు, "మీ తీరు ఆదిలోనే హంసపాదు" అన్నట్టుగా ఉందని విమర్శించారు. ఈ మేరకు తన ట్వీట్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖ ప్రతిని కూడా పంచుకున్నారు.