ఏపీ అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి రద్దయిన వైనం!

nimmagadda collectors meet cancel
  • జిల్లాల అధికారులతో నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ప్రయత్నాలు
  • స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించాలని యోచన
  • అధికారులకు సీఎస్ నుంచి అనుమతి రాని వైనం
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై  ఆయన కీలక ప్రకటన చేసే అవకాశముంది. అయితే, ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు నిమ్మగడ్డ ఓ లేఖ రాయగా, వారు సమావేశంలో పాల్గొనలేదు.

ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్‌ఈసీ చెప్పారు. అయినప్పటికీ, సీఎస్ నుంచి అధికారులకు అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. దీంతో సీఎస్ నీలం సాహ్నికి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మరోసారి లేఖ రాశారు. కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని అందులో కోరినట్లు తెలిసింది.

అయినప్పటికీ, సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఈ వీడియో కాన్ఫరెన్స్ మరోసారి  రద్దు అయ్యింది. వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో పాల్గొనాలని సీఎస్ నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు అధికారులకు అనుమతి ఇవ్వకపోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని ఎస్ఈసీ భావిస్తున్నట్లు తెలిసింది.
Go Back to Shorts
Nimmagadda Ramesh
Andhra Pradesh
Municipal Elections

More Telugu News