ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారం.. డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకున్న గాలి జనార్దన్రెడ్డి
- రాజకీయ ఒత్తిళ్లతోనే సీబీఐ కేసులన్న గాలి జనార్దన్రెడ్డి
- సరిహద్దు వివాదమే తేలకుండా అక్రమ మైనింగ్ అని ఎలా చెబుతారని ప్రశ్న
- బెయిలు కుంభకోణం కేసు విచారణ 24కు వాయిదా
ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ గతంలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్టు గాలి తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. దీనిపై ఎటువంటి వాదనలు వినిపించబోమని చెప్పడంతో అనుమతించిన కోర్టు డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేసింది. గాలి పీఏ మెఫజ్ అలీఖాన్, మాజీ ఐఏఎస్ కృపానందం దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. అలాగే, గాలి జనార్దన్రెడ్డి బెయిలు కుంభకోణానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.