బీజేపీలో చేరిన హైదరాబాద్ మాజీ మేయర్
- కాషాయ కండువా కప్పుకున్న బండ కార్తీక
- కాంగ్రెస్ తనను రెండు సార్లు మోసం చేసిందని మండిపాటు
- ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే అని వ్యాఖ్య
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాను కార్పొరేటర్ గా పోటీ చేయడం లేదని, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేద్దామని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి చెప్పారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి నాయకుడు కలిసికట్టుగా పని చేశాడని అన్నారు.