బీజేపీలో చేరేందుకు 10 మంది టీఆర్ఎస్ నాయకులు సిద్ధంగా ఉన్నారు: ఎంపీ సోయం బాపూరావు
- 10 మంది నేతలు నాతో చర్చలు జరుపుతున్నారు
- కేసీఆర్, కేటీఆర్ పట్ల వారు అసంతృప్తిగా ఉన్నారు
- మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి టీఆర్ఎస్ భయపడుతోంది
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహారశైలి పట్ల వారంతా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. మేయర్ అభ్యర్థిని ప్రకటించడానికి కూడా టీఆర్ఎస్ భయపడుతోందని అన్నారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత... బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వంద స్థానాలను గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీలో చేరబోతున్న 10 మంది టీఆర్ఎస్ నేతలు ఎవరో మాత్రం ఆయన వెల్లడించలేదు.