గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
- కంటైనర్ను ఢీకొన్ని లారీ
- మరో 17 మందికి తీవ్ర గాయాలు
- ప్రమాదంపై ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి
ప్రమాదం కారణంగా రహదారిపై ట్రాఫిక్ స్తంభించి పోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాల్సిందిగా అధికారులకు సూచించారు.