నిన్న రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి ఆదాయం
- శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు
- రూ.1.50 కోట్లు సమర్పించిన అజ్ఞాత భక్తుడు
- కొండపై పెరుగుతున్న భక్తుల సంఖ్య
దీపావళి రోజులు కావడంతో గత కొన్నిరోజులుగా తిరుమల వెంకన్న క్షేత్రంలో భక్తుల సందడి పెరిగింది. పునఃప్రారంభం తర్వాత భక్తుల రాక తగ్గినా, క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజా రవాణా కూడా ఊపందుకోవడంతో కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న తిరుమల వెంకన్నను 22,462 మంది దర్శించుకున్నారు.