సాగర్ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, కుమారుడు దుర్మరణం
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా సఫారీ వాహనం
- తుర్కయాంజల్ పరిధిలోని రాగన్నగూడ వద్ద ఘటన
- కారులో ఉన్న ఇద్దరి పరిస్థితి విషమం
మృతులను రాగన్నగూడలోని జీవీఆర్ కాలనీకి చెందిన సంరెడ్డి ప్రదీప్ రెడ్డి (19), అతడి తల్లి చంద్రకళ (48)గా గుర్తించారు. మరోవైపు, కారులో ఉన్న ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారికి కామినేని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.