Dubbaka: నరాలు తెగే ఉత్కంఠ.. 20, 21వ రౌండ్లలో మళ్లీ ఆధిక్యంలోకి బీజేపీ

  • టీ20 మ్యాచ్ ను తలపిస్తున్న దుబ్బాక ఫలితాలు
  • 20 వ రౌండులో 551 ఓట్ల ఆధిక్యతను సాధించిన బీజేపీ
  • 21వ రౌండు ముగిసే సరికి 620 ఓట్ల మెజార్టీని సాధించిన బీజేపీ
BJP gets lead in 20 and 21 rounds in Dubbaka

దుబ్బాక ఉపఎన్నిక నరాలు తెంచే ఉత్కంఠను రేపుతోంది. 19వ రౌండు ముగిసే సరికి బీజేపీపై టీఆర్ఎస్ ఆధిక్యతను సాధించిన సంగతి తెలిసిందే. అయితే 20, 21వ రౌండ్లలో బీజేపీ మళ్లీ ముందుకు వచ్చింది. 20వ రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 551 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఈ రౌండులో బీజేపీకి 2,931 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 2,440 ఓట్లు పడ్డాయి.

మరోవైపు 21వ రౌండులో కూడా బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ రౌండులో బీజేపీ 380 ఓట్ల లీడింగ్ సాధించింది. తద్వారా 21వ రౌండు ముగిసే సరికి బీజేపీ మొత్మంమీద బీజేపీ 620 ఓట్ల మెజార్టీతో నిలిచింది.

More Telugu News