Dubbaka: దుబ్బాకలో మారిన ట్రెండ్.. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు ఆధిక్యం

  • ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 353 ఓట్ల ఆధిక్యత
  • మొత్తంమీద 2,667 ఓట్ల ఆధిక్యతలో బీజేపీ
  • మరో 17 రౌండ్లను లెక్కించాల్సి ఉంది
TRS gets lead in sixth round of Dubbaka counting

దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ లో మార్పు చోటు చేసుకుంది. తొలి ఐదు రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను సాధించగా... ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ దూసుకొచ్చింది. ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ 353 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు  4,062 ఓట్లు రాగా... బీజేపీకి 3,079 ఓట్లు, కాంగ్రెస్ కు 530 ఓట్లు వచ్చాయి.

ఆరో రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 20,226, టీఆర్ఎస్ కు 17,559, కాంగ్రెస్ కు 3,254 ఓట్టు వచ్చాయి. మొత్తం మీద 2,667 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యతలో ఉన్నారు. ఇప్పటి వరకు దుబ్బాక మండలం, పురపాలక సంఘం పరిధిలోని ఓట్లను లెక్కించారు. మరో 17 రౌండ్లను లెక్కించాల్సి ఉంది.

More Telugu News