Andhra Pradesh: మొదలైన చలి పంజా... చింతపల్లిలో 11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!

  • పాడేరులో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రత 
  • రెండు వారాల ముందే వచ్చిన చలికాలం
  • రాబోయే రోజుల్లో మరింత తీవ్రత
Heavy Cold in Manyam Area

ఈ సీజన్ లో చలిపులి పంజా విసరడం ప్రారంభమైంది. విశాఖ మన్యం పరిధిలోని చింతపల్లిలో నిన్న 11 డిగ్రీలు, పాడేరులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత నెలాఖరులో ఈ ప్రాంతంలో 13.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గగా, ఆపై నిన్న అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. వాస్తవానికి దీపావళి తరువాత పెరగాల్సిన చలి, ఈ సంవత్సరం రెండు వారాల ముందుగానే పెరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

More Telugu News