kamala harris: నిన్న నా మేనకోడలు కమలాహారిస్‌కి ఫోను చేసి ఈ విషయం చెప్పాను: మేనమామ గోపాలన్

  • మీడియాతో మాట్లాడిన ఢిల్లీకి చెందిన గోపాలన్
  • నా మేనకోడలు‌ గెలుస్తుందని ముందే చెప్పాను
  • గెలవాలని మనమందరం కోరుకున్నాం
gopalan about kamala harris victory

అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా విజయం సాధించిన డెమోక్రాటిక్ అభ్యర్థులు జో బైడెన్, కమలాహారిస్‌లకు భారతీయుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కమలాహారిస్‌ మేనమామ, ఢిల్లీలో స్థిరపడ్డ గోపాలన్‌ బాలచంద్రన్ తన మేనకోడలి విజయంపై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. తన మేనకోడలు‌ గెలుస్తుందని తాను ముందే చెప్పానని అన్నారు.

ఈ ఎన్నికల్లో జో బైడెన్, కమలాహారిస్‌ గెలవాలని మనమందరం కోరుకున్నామని గోపాలన్ చెప్పారు. కమలాహారిస్‌తో తాను నిన్న మాట్లాడానని తెలిపారు. ఆమె విజయం సాధించబోతుందని ఆమెతో అన్నానని చెప్పారు. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఎన్నికై  ఆ పదవి చేపట్టబోతున్న మొట్టమొదటి మహిళగా, ఆసియన్‌-అమెరికన్‌గా ఆమె నిలిచారు. కాగా, క‌మ‌లాహారిస్ విజయం సాధించడంతో ఆమె తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తమిళనాడులోని తులసేంద్రపురంలో స్థానికుల సంబరాలు అంటరాన్నంటాయి.  



More Telugu News