మసీదులో హోమం చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రాచి!
- మధురలో ఆలయంలో నమాజులు
- ఘాటుగా స్పందించిన సాధ్వీ ప్రాచి
- మసీదులు కూల్చి హోమాలు చేయాలంటూ పిలుపు
- ఆపై తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న వైనం
"వాళ్లు ఆ విధంగా చేస్తున్నప్పుడు హిందువులు కూడా మసీదులకు వెళ్లి హోమాలు చేయాలని మేం అనుకుంటున్నాం. ఆ విధంగా సామాజిక మత సామరస్యం నెలకొంటుందని భావిస్తున్నాం. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, అపవిత్రం చేసి ఆ మసీదులు నిర్మించారు. అందుకే ఆ మసీదులను కూల్చి అక్కడ హోమాలు చేయాలి. ఆ విధంగా నేనే చేస్తాను. లక్నోలోని ఓ పాత మసీదులో హోమం నిర్వహిస్తాను. తద్వారా వాయు కాలుష్యం తొలగిపోవడమే కాదు, సామాజిక మత సామరస్యం కూడా ఏర్పడుతుంది" అని వ్యాఖ్యానించారు.
సాధ్వీ ప్రాచి ఈ కార్యక్రమానికి బీజేపీ తదితర హిందుత్వ నేతలు రావాలంటూ ఆహ్వానించారు. కాగా, తన వ్యాఖ్యలను సాధ్వీ ప్రాచి కొన్నిగంటల్లోనే వెనక్కి తీసుకున్నట్టు సమాచారం.