టాలీవుడ్ నిర్మాత పీడీవీ ప్రసాద్ కు భార్యా వియోగం
- గుండెపోటుకు గురైన పీడీవీ ప్రసాద్ భార్య అంజు
- కిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
- సంతాపం తెలిపిన హారిక హాసిని, సితార సంస్థలు
పీడీవీ ప్రసాద్ హారిక హాసిని బ్యానర్ పై తెరకెక్కే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు, సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తుంటారు. కాగా, భార్యను కోల్పోయిన పీడీవీ ప్రసాద్ కు హారిక హాసిని, సితార సంస్థలు ప్రగాఢ సంతాపం తెలిపాయి.