ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పెంచాలంటూ పిల్.. హైకోర్టు ఆదేశాలు
- కరోనా, భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోలేదని పిటిషన్
- ఓటరు నమోదుకు తగినంత ప్రచారం కూడా కల్పించలేదన్న పిటిషనర్
- ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
ఈ పిటిషన్ ను జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బొల్లారం విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సాధారణ పరిస్థితుల్లో అయితే షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లడం సరికావచ్చని... ప్రస్తుతం కరోనా, భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాశ్ దేశాయ్ తమ వాదనలను వినిపిస్తూ... అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6 మధ్య పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందని... దీని ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందిస్తామని చెప్పారు. వీటిపై అభ్యంతరాలుంటే డిసెంబర్ 1 నుంచి 31 వరకు గడువు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ, పిటిషనర్ పిటిషన్ మేరకు ఓటరు నమోదుకు గడువు పెంచడంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.