Boat: గంగానదిలో ఘోర ప్రమాదం... 70 మంది గల్లంతు!

Boat capsize in Ganga River at Bhagalpur district of Bihar
  • వందమందితో ప్రయాణిస్తున్న బోటు
  • బీహార్లోని భాగల్ పూర్ వద్ద ఘటన
  • 30 మందిని రక్షించిన స్థానికులు
వందమంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బోటు గంగానదిలో మునిగిపోయిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. బీహార్ లోని భాగల్ పూర్ వద్ద గంగానదిలో జరిగిన ఈ ప్రమాదంలో 70 మంది గల్లంతయ్యారు. పడవ మునకపై స్థానికులు వెంటనే స్పందించడంతో 30 మంది సురక్షితంగా బయటపడ్డారు.

ప్రత్యేక బృందాలు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. నౌగాచియా ప్రాంతానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ కూలీలు నదిని దాటేందుకు బోటులో వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గంగా పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ దళాలు గల్లంతైన వారికోసం గాలిస్తున్నాయి.
Boat
Ganga River
Bihar
Bhagalpur

More Telugu News