Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • జనవరి నుంచి మహేశ్ సినిమాలో కీర్తి సురేశ్ 
  • నాగ చైతన్య సరసన కథానాయికగా రకుల్
  • మరోసారి తెరపై సూర్య, జ్యోతిక జంట సందడి  
Keerti Suresh will join Mahesh movie in January

*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందే 'సర్కారు వారి పాట' చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి అమెరికాలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, తాను మాత్రం ఈ చిత్రం షూటింగులో జనవరి నుంచి పాల్గొంటానని ఆ చిత్ర కథానాయిక కీర్తి సురేశ్ పేర్కొంది.
*  అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు 'థ్యాంక్యూ' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ప్రియాంక అరుల్ మోహన్ ని ఇప్పటికే ఎంపిక చేయగా, మరో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైంది.
*  నిజజీవితంలో భార్యాభర్తలైన జ్యోతిక, సూర్య జంట త్వరలో ఓ సినిమా కోసం జతకట్టనుంది. 2006లో వివాహం తర్వాత వీరిద్దరూ కలసి నటించలేదు. మలయాళ చిత్ర దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో త్వరలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News