ఉత్తరాఖండ్ లో నిన్న మొదలైన స్కూళ్లు... ఓ విద్యార్థికి కరోనా!
- తిరిగి తెరచుకున్న పాఠశాలలు
- విద్యార్థికి కరోనా రావడంతో స్కూల్ మూత
- అతనితో ఉన్న 15 మంది క్వారంటైన్ కు
ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి జేసీ పాండే, పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించామని, స్కూల్ గదులు, ఆవరణను శానిటైజ్ చేయనున్నామని అన్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 3,941 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 1,027 మంది చనిపోగా, 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.