రేవంత్ రెడ్డిని కొడంగల్ పోయి ఓడించా... ఇది నా అడ్డా... వాళ్లొచ్చి ఏంచేస్తారు?: హరీశ్ రావు
- దుబ్బాకలో హరీశ్ రావు ప్రచారం
- బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేసిన హరీశ్ రావు
- టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని వ్యాఖ్యలు
అభివృద్ధిని కళ్లుండీ చూడలేని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అంటూ విమర్శించారు. సీసాలు, పైసలు, అవాస్తవాలనే నమ్ముకున్నారని, బీజేపీకి పరాయి నేతలు, కిరాయి మనుషులే దిక్కయ్యారని అన్నారు.
హరీశ్ రావు ఇవాళ రాయపోల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లోనూ ప్రసంగించారు. టీఆర్ఎస్ కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ ఏకపక్ష విజయం ఖాయమని అన్నారు. దుబ్బాకలోనూ టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖాయమైందని పేర్కొన్నారు.