చిలుకలు, పావురాలతో సరదాగా నరేంద్ర మోదీ... ఫొటోలు ఇవిగో!
- గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ
- సొంతరాష్ట్రంలో రెండ్రోజుల పర్యటన
- కెవాడియాలో విహంగ ఆవాస కేంద్రం ప్రారంభోత్సవం
అక్కడ అందమైన పావురాలు, రామచిలుకలను వీక్షిస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. అనేక జాతుల పక్షులను ఆసక్తిగా తిలకించారు. వాటిలో కొన్ని రకాలు చిలుకలు మోదీ చేతిపై వాలాయి. ఈ అనుభూతిని ఆయన చాలా ఆస్వాదించారు. అంతకుముందు ఈ పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తూ పంజరంలో ఉన్న పావురాళ్లను బయటికి వదిలారు.