ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్... బ్యాట్ విసిరికొట్టిన గేల్
- దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
- 63 బంతుల్లో 99 పరుగులు చేసిన గేల్
- 6 ఫోర్లు, 8 సిక్సులు కొట్టిన విండీస్ వీరుడు
ఇక మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు గేల్, రాహుల్ (46) చలవతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. చివర్లో నికొలాస్ పూరన్ 10 బంతుల్లో 3 సిక్సులతో 22 పరుగులు చేశాడు. ఇక, గేల్ ఇన్నింగ్స్ హైలైట్ అని చెప్పాలి. గేల్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విలవిల్లాడారు. ఈ మెరుపువీరుడు 6 ఫోర్లు, 8 సిక్సులు బాదాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ ద్వారా గేల్ టీ20 క్రికెట్లో 1000 సిక్సులు పూర్తి చేసుకున్నాడు.