తూర్పుగోదావరిలో దారుణం.. పెళ్లి వ్యాను బోల్తాపడి ఆరుగురి దుర్మరణం
- గోకవరం మండలం తుంటికొండ ఘాట్రోడ్డులో ఘటన
- వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపై నుంచి కిందపడిన వ్యాన్
- బాధితులు టాకూర్పాలేనికి చెందిన వారిగా గుర్తింపు
పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో వ్యాను బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కొండపై నుంచి కిందపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు ప్రారంభించారు. బాధితులను మండలంలోని టాకూర్పాలేనికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.