'ఈశాన్య' జోరు... చెన్నై నగరాన్ని ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- తమిళనాడును పలకరించిన ఈశాన్య రుతుపవనాలు
- నిన్న రాత్రి నుంచి చెన్నైలో భారీ వర్షాలు
- లోతట్టు ప్రాంతాలు జలమయం
మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. దాంతో చెన్నై వాసుల్లో ఆందోళన నెలకొంది. గతంలో చెన్నైలో వచ్చిన వరదలను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాగా, కొన్నిరోజుల కిందటే దేశంలో నైరుతి రుతుపవనాల నిష్క్రమణం షురూ అయింది. నిన్నటితో దేశం నుంచి పూర్తిగా తొలగిపోవడంతో, ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలైంది.