ఉత్తరాఖండ్ సీఎం రావత్ పై అవినీతి ఆరోపణలు.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం.. సుప్రీంకోర్టుకు సీఎం!
- బీజేపీ ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఓ నియామకానికి డబ్బులు పుచ్చుకున్నారని ఆరోపణ
- జర్నలిస్టుల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాలు
- విమర్శలు స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్న న్యాయస్థానం
శివప్రసాద్ సేమ్వాల్లు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారిద్దరూ రావత్పై పలు ఆరోపణలు చేశారు. బీజేపీ ఝార్ఖండ్ ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఓ నియామకం విషయంలో ఆయన డబ్బులు పుచ్చుకున్నారంటూ జర్నలిస్ట్ ఉమేశ్ శర్మ ఓ వీడియోలో ఆరోపించారు. ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ మేరకు జస్టిస్ రవీంద్ర మైథానీ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, విమర్శలను స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. రావత్పై హైకోర్టు మంగళవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా, ఆ తీర్పును రావత్ నిన్న సుప్రీంకోర్టులో సవాలు చేశారు.