and: ఏపీ కరోనా అప్ డేట్స్.. మరో 18 మంది మృతి
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 2,949 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,14,774కి చేరుకుంది. మొత్తం 6,643 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గత 24 గంటల్లో 3,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో మొత్తం 77,028 మంది కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.