పాక్లో భారీ ఉగ్రదాడి.. ఏడుగురి మృతి.. 70 మందికి గాయాలు
- పాకిస్థాన్లోని పెషావర్, దిర్ కాలనీలో ఘటన
- మృతుల్లో నలుగురు విద్యార్థులు
- ఆసుపత్రులకు తరలిస్తున్న సిబ్బంది
మదర్సాలో ఓ సమావేశం జరుగుతోన్న సమయంలో చాలా మంది వచ్చారని, అదే సమయంలో ఓ పేలుడు సంభవించిందని అధికారులు చెప్పారు. ఉగ్రవాదులు పేలుడు కోసం ఐఈడీ వాడారని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఈ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరో తెలియరాలేదని వివరించారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు.