Mahesh Babu: నేనే అమ్మవారిని అంటోన్న నయన్.. మహేశ్ విడుదల చేసిన ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్ అదుర్స్!

  • కనకదుర్గగా హీరోయిన్ నయనతార  
  • దసరా సందర్భంగా ఈ రోజు ట్రైలర్
  • దీపావళికి సినిమా విడుదల
Ammoru Thalli official Telugu trailer Nayanthara Nov 14

హీరోయిన్ నయనతార కనకదుర్గగా నటిస్తోన్న సినిమా'అమ్మోరు తల్లి'నుంచి దసరా సందర్భంగా ఈ రోజు టీజర్ విడుదలైంది. తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ‘ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తోన్న తొలి సినిమా'అమ్మోరు తల్లి'ట్రైలర్ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీతో పాటు నయనతార నటిస్తున్నారు.

ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఆయనతో పాటు ఆ సినిమా బృందానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని మహేశ్ పేర్కొన్నాడు. కాగా, ఈ ట్రైలర్ లో అమ్మవారిగా నయనతార దర్శనమిస్తూ చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ భక్తిరస సినిమాలో కామెడీ కూడా అధికంగానే ఉంది. అడ్డమైన నీళ్లతో తనకు అభిషేకాలు చేస్తున్నారని, అందుకే తన తల వెంట్రుకల కలర్ మారిందని నయనతార అంటోంది.

More Telugu News