వైసీపీ ఎమ్మెల్యేల అక్రమ కట్టడాలను కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా?: బండారు సత్యనారాయణ

Its our fate to have a CM who has 18 cases says Bandaru
షార్ట్స్‌లో చూడండి
గీతం యూనివర్శిటీ కట్టడాలను కూల్చడంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ పేరును పెట్టిన గీతం విశ్యవిద్యాలయాన్ని కూల్చడం దారుణమని అన్నారు. కరోనా సమయంలో అందరికంటే కంటే ముందే సేవలందించిన ఘనత గీతం ఆసుపత్రిదని చెప్పారు. ఈ విషయం కాదని నిరూపిస్తే... వైసీపీ కార్యాలయం ముందు ఉరేసుకుంటానని సవాల్ విసిరారు. విశాఖలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలకు అక్రమ కట్టడాలు ఉన్నాయని... వాటిని కూల్చే దమ్ము జీవీఎంసీ అధికారులకు ఉందా? అని ప్రశ్నించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని దుయ్యబట్టారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన ఖర్మ అని అన్నారు.
Go Back to Shorts
Bandaru Satyanarayana
Telugudesam
Jagan
YSRCP
GITAM

More Telugu News