జమ్మూ కశ్మీర్ పతాకం తిరిగొచ్చేంత వరకు జాతీయ పతాకాన్ని ఎగురవేయం: మెహబూబా ముఫ్తీ
- గృహనిర్బంధం తర్వాత మీడియా ముందుకొచ్చిన మెహబూబా
- కశ్మీర్ విషయంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
- తమ రాజ్యాంగాన్ని దొంగిలించారంటూ వ్యాఖ్యలు
"జమ్మూ కశ్మీర్ లో జాతీయ పతాకం ఉందంటే అందుకు కారణం మా పతాకం, మా రాజ్యాంగం వల్లే. దేశంలోని మిగతా భూభాగంతో మేం అనుసంధానమయ్యాం అంటే అందుకు కారణం మా పతాకమే" అని వివరించారు. అంతేకాదు, జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు ఎన్నికల్లో పోటీచేయబోనని వెల్లడించారు. మా సొంత రాజ్యాంగం పరిధిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.