ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ లాకర్లో 1250 గ్రాముల బంగారం, 7.2 కిలోల వెండి!
- లంచం కేసులో దొరికిపోయి జైలులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు
- ఆయన బినామీల లాకర్లను తెరిచిన అధికారులు
- బినామీ లాకర్లను నిర్వహిస్తున్న నాగరాజు భార్య స్వప్న
తన స్నేహితుడైన నందగోపాల్, ఐసీఐసీఐలో పనిచేసే ఆయన సోదరుడైన మహేందర్లను నాగరాజు ఒప్పించి వారితో ఈ లాకర్లను తెరిచినట్టు దర్యాప్తులో తేలింది. ఈ రెండింటిని నాగరాజు భార్య స్వప్న నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? వాటి మార్కెట్ విలువ ఎంత అనే దానిపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.