Ramoji Rao: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రామోజీరావు భారీ విరాళం

Ramoji Rao has contributed 5 crores to CM relief fund
  • వరద బాధితుల కోసం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిన రామోజీరావు
  • రామోజీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
  • రూ. 10 లక్షల విరాళం ఇచ్చిన దర్శకుడు ఎన్.శంకర్
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోంది.

ఇదే సమయంలో వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి ఈ చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు సినీ దర్శకుడు ఎన్.శంకర్ కూడా వరద బాధితుల సహాయార్థం తన వంతుగా రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ ను స్వయంగా కేటీఆర్ కు ఆయన అందించారు.
Ramoji Rao
Flood Victims
CMRF

More Telugu News