తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 వేలు విరాళం ఇచ్చిన సంపూర్ణేశ్ బాబు
- తెలంగాణలో వరద బీభత్సం
- హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జలప్రళయం
- మంత్రి హరీశ్ రావుకు చెక్ అందించిన సంపూ
తాజాగా, సంపూర్ణేశ్ బాబు మంత్రి హరీశ్ రావుకు రూ.50 వేలు చెక్ రూపంలో అందించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబును మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు.