మూసీ నదికి శాంతి పూజలు చేసిన తెలంగాణ సర్కారు
- భారీవర్షాలకు ఉగ్రరూపం దాల్చిన మూసీ
- శాంతించాలంటూ ప్రత్యేక పూజలు
- గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
గంగమ్మ తల్లికి బోనం సమర్పించడంతో పాటు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు నివేదించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, 1908లోనూ భారీ వరదలు సంభవించడంతో నాటి నిజాం పాలకుడు మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీ నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మూసీ నదికి అంతటిస్థాయిలో భారీ వరదలు రావడం మళ్లీ ఇదే ప్రథమం.