ఐపీఎల్ లో నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ... టాస్ గెలిచిన శ్రేయాస్ అయ్యర్
- దుబాయ్ వేదికగా మ్యాచ్
- బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- మళ్లీ వచ్చిన పంత్
జట్ల విషయానికొస్తే... పంజాబ్ జట్టులో క్రిస్ జోర్డాన్ స్థానంలో కివీస్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ కు స్థానం కల్పించారు. ఇక, ఢిల్లీ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. రిషబ్ పంత్, హెట్మెయర్, డేనియల్ శామ్స్ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై సూపర్ ఓవర్ ద్వారా విజయం సాధించిన పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసం పుంజుకుంది. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.