Chandrababu: ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: చంద్రబాబు

Chandrababu urged people of Hyderabad please stay at home until this deluge is over
  • భాగ్యనగరంపై వరుణుడి పంజా
  • ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలన్న చంద్రబాబు
  • సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ టీడీపీ శ్రేణులకు నిర్దేశం

హైదరాబాద్ నగరాన్ని గత కొన్నిరోజులుగా ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు ఇంకా శాంతించలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్న నేపథ్యంలో భాగ్యనగరానికి మరికొన్ని రోజుల పాటు వర్షసూచన వెలువడింది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ జలప్రళయం ముగిసేంతవరకు హైదరాబాద్ ప్రజలు ఇళ్ల వద్దనే ఉండడం ద్వారా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. పౌరులందరూ స్వీయరక్షణతో పాటు కుటుంబాల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

"మీ అందరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా నగరంలో ఎక్కడ సేవలు అవసరమైనా ముందుండాలని, సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని టీడీపీ నాయకులను, కార్యకర్తలను కోరుతున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News