వరద బాధితులకు వెంటనే పరిహారం ఇవ్వాలి: అధికారులకు సీఎం జగన్ ఆదేశం
- వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన జగన్
- వరద బాధితులను గుర్తించాలని ఆదేశం
- రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని ఇవ్వాలన్న సీఎం
అనంతరం అధికారులతో వరద పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను తక్షణమే గుర్తించి వారికి నష్ట పరిహారం అందించాలని ఈ సందర్బంగా సీఎం ఆదేశించారు. పంట నష్టంపై వీలైనంత త్వరగా అంచనాలను పూర్తి చేయాలని చెప్పారు. రైతులకు వీలైనంత త్వరగా ఇన్ పుట్ సబ్సిడీని అందించాలని ఆదేశించారు. సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీని ఇస్తే... రబీ సీజన్ లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని చెప్పారు.