Telugudesam: టీడీపీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యక్షులుగా ముగ్గురు మహిళలకు స్థానం!

  • 27 మందితో సెంట్రల్ కమిటీ ఏర్పాటు
  • ఉపాధ్యక్షులుగా గల్లా అరుణ, సత్యప్రభ, ప్రభావతి
  • జనరల్ సెక్రటరీగా నారా లోకేశ్
List of Telugudesam party Central Committee

తెలుగుదేశం కమిటీలను ఆ పార్టీ  అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు కమిటీలను ప్రకటించడంతో పాటు పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీలను కూడా ప్రకటించారు. 27 మందితో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులకు చోటు కల్పించారు. సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు వ్యవహరించనున్నారు.

టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులు వీరే:

సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లు:
ప్రభావతి, గల్లా అరుణకుమారి, సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, సీహెచ్ కాశీనాథ్.

జనరల్ సెక్రటరీలు:
నారా లోకేశ్, వర్ల రామయ్య, రామ్మోహన్ నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్ రెడ్డి, బక్కని నరసింహులు, కంభంపాటి రామ్మోహన్ రావు.

అధికార ప్రతినిధులు:
గుణపాటి దీపక్ రెడ్డి, పట్టాభిరాం, మొహమ్మద్ నజీర్, ప్రేమ్ కుమార్ జైన్, జ్యోత్స్న, నన్నూరి నర్సి రెడ్డి.

ఆఫీస్ సెక్రటరీ: పరుచూరి అశోక్ బాబు.

క్రమశిక్షణ కమిటీ:
బచ్చుల అర్జునుడు (ఛైర్మన్), మునిరత్నం, గుంటుపల్లి నాగేశ్వరరావు, బంటు వెంకటేశ్వరరావు.

ట్రెజరర్: శ్రీరాం రాజ్ గోపాల్.

More Telugu News