Jammu And Kashmir: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విరిగిపడిన కొండచరియలు.. బస్సులో ఉన్న 16 మందీ దుర్మరణం

  • ప్రయాణికులతో రోండూ నుంచి రావల్పిండి బయలుదేరిన బస్సు
  • గిల్గిత్-బాల్టిస్థాన్ మార్గంలో ఘటన
  • రాత్రి నుంచి ఉదయం వరకు కొనసాగిన సహాయక చర్యలు
16 dead in POK after landslides fell on the bus

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దారుణం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సుపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. రోండూ నుంచి 18 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి ఓ బస్సు రావల్పిండి బయలుదేరింది.

మార్గమధ్యంలో ఇద్దరు ప్రయాణికులు వారి గమ్యస్థానం వద్ద దిగిపోగా, మిగతా 16 మందితో బస్సు బయలుదేరింది. బస్సు గిల్గిత్-బాల్టిస్థాన్ మార్గంలో ప్రయాణిస్తుండగా బస్సుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. శనివారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు సహాయక చర్యలు కొనసాగాయి.

More Telugu News