పంజాబ్ పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

Mumbai Indians won the toss
  • దుబాయ్ లో ముంబయి వర్సెస్ పంజాబ్
  • ఫేవరెట్ గా బరిలో దిగుతున్న ముంబయి
  • క్రిస్ గేల్ రాకతో బలంగా కనిపిస్తున్న పంజాబ్
ఐపీఎల్ లో నేడు జరిగే రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించిన ముంబయి ఈ పోరులో ఫెవరెట్ గా నిలుస్తోంది.

మరోవైపు కేఎల్ రాహుల్ నాయకత్వంలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చెత్త ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఆ జట్టు 8 మ్యాచ్ లు ఆడి ఆరింట ఓడిపోయింది. అయితే విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఆడిన గత మ్యాచ్ లో గెలవడం పంజాబ్ కు కొద్దిగా సానుకూలాంశం.
Go Back to Shorts
Mumbai Indians
Toss
KXIP
Dubai
IPL 2020

More Telugu News