రఘురామకృష్ణరాజుపై వేటు... సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా ఎంపీ బాలశౌరి నియామకం
- లోక్ సభ స్పీకర్ ప్రకటన
- వైసీపీ పార్లమెంటరీ పార్టీ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం
- ఇటీవల తిరుగుబాటు గళం వినిపిస్తున్న రఘురామ
ఎంపీ రఘురామకృష్ణరాజు గతకొంతకాలంగా వైసీపీ అధినాయకత్వంపై తిరుగుబాటు ధోరణి కనబరుస్తున్నారు. నేరుగా సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి పెద్దలను టార్గెట్ చేస్తూ పార్టీకి కంట్లో నలుసులా మారారు. దాంతో ఆయనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించడంలో వైసీపీ సఫలమైంది.
కాగా, దీనిపై రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. ఆ పదవియొక్క కాలం ఒక సంవత్సరం మాత్రమే. నా పదవీకాలం ముగియడం వలన.. వైసీపీ పార్లమెంటరీ పార్టీ విజ్ఞప్తుల మేరకు ఆ పదవిలో బాలశౌరిని నియమించారు. అంతేకాని నన్నెవరూ పీకలేదు.. నన్నెవరూ పీకలేరు అని చెప్పారు.