YS Vijayamma: పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్

  • ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ కు భార్యావియోగం
  • చికిత్స పొందుతూ కన్నుమూసిన పిల్లి సత్యనారాయణమ్మ
  • పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఫోన్ చేసిన వైఎస్ కుటుంబసభ్యులు
YS Vijayamma and Sharmila talks to Pilli Subhash Chandrabose

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇటీవలే భార్యా వియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన భార్య సత్యనారాయణమ్మ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ ఫోన్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించారు.

పిల్లి సత్యనారాయణమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేశారు. ధైర్యంగా ఉండాలంటూ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబసభ్యులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News