బీజేపీ నేత ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన దివ్యాంగుల సంఘం
- ఇటీవలే కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ
- కాంగ్రెస్ కు మేధో వైకల్యం ఏర్పడిందంటూ వ్యాఖ్యలు
- ఖుష్బూ వ్యాఖ్యలపై దివ్యాంగుల సంఘం ఆగ్రహం
దాంతో నష్టనివారణకు ఉపక్రమించిన ఖుష్బూ క్షమాపణలు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు. కానీ, దివ్యాంగుల హక్కుల సంఘం మాత్రం ఖుష్బూ క్షమాపణలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, ఆమెపై రాజీలేని పోరాటం చేస్తామని అంటోంది. ఈ క్రమంలో సంఘం కార్యకర్తలు ఖుష్బూపై 50 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఖుష్బూ చట్టాన్ని అతిక్రమించారని, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని వారు పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు చట్టప్రకారం ఆరు నెలల శిక్ష పడొచ్చని తెలిపారు.