కరోనా బారినపడిన ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న అఖిలేశ్
- గురుగ్రామ్లోని మేదాంతలో చేరిన ములాయం
- ఒక్క లక్షణం కూడా లేదన్న పార్టీ
- ములాయం భార్యకు కూడా సోకిన మహమ్మారి!
ములాయం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ములాయం ఆగస్టులో కడుపు నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చాలా రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు కరోనా కారణంగా మరోమారు ఆసుపత్రిలో చేరారు.