తిరుపతిలో 20 ఏళ్ల యువతిపై పాస్టర్ అత్యాచారయత్నం!
- తిరుపతిలో కలకలం రేపుతున్న అత్యాచారయత్నం ఘటన
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని దిశ పీఎస్ పోలీసులు
- స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ సుప్రజ
బాధితురాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి లక్ష్మి స్పందిస్తూ, బాధితురాలిపై రెండు సార్లు అత్యాచారయత్నం జరిగిందని తెలిపారు. దిశ పోలీస్ స్టేషన్ ఎస్సై హైమావతి బాధితురాలితో అమానవీయంగా వ్యవహరించారని మండిపడ్డారు. పోలీసులే పట్టించుకోకపోతే బాధితులు ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. యువతి జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన దేవసహాయంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.